కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!

Andhra Pradesh Political

మీరు కల్పించుకోకపోతే…. కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!.. : సునీత: వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ” అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇక అధికారం అనేది నాకు కొత్త కాదు. ఈ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ అధికారానికి దూరంగా వెళ్దామని ఇంతకాలం ప్రయత్నిస్తున్నాను. ఈ విషయం మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న అందరికీ తెలుసు. కానీ దేవుడు ఏం రాసి పెట్టాడో. ఈ పరిస్థితిని కల్పించాడు. ఇక్కడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాను. వివేకా మర్డర్ కేసులో బహుశా రాజకీయ నాయకులు కల్పించుకోకపోతే ఒక కానిస్టేబుల్ తేల్చిపడేసే కేసు ఇది. అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల ప్రభావంతో ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇంకా సాగుతూనే ఉంది. ఎంతకాలం సాగుతుందో తెలియదు” అని అన్నారు.ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ స్టేటస్‌ని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారని, అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్ అని అన్నారు. అప్రూవర్ స్టేటస్ విషయం కోర్టుకి, దర్యాప్తు సంస్థకు మధ్య ఉంటుందని ఆమె అన్నారు.మా కుటుంబాన్ని ఇబ్బందిపెడుతున్నారని, మా నాన్న జైల్లో పెట్టారని అవినాశ్ రెడ్డి అంటున్నారు. మరి మా కుటుంబం సంగతేంటి?. మా నాన్నను అత్యంత దారుణంగా చంపేశారు.