ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని

National Political

ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని… ఆనందం వ్యక్తం చేసిన మోడీ; భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కొత్తదనం మంగళూరులో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మంగళూరులో ఆదివారం ప్రధాని రోడ్ షో జరిగింది. మంగళూరు రోడ్ షో చరస్మరణీయమైనది అని మోడీ గారు అన్నారు. ఎందుకంటే ఈ రోడ్ షోలో నాతోపాటు మాజీ ప్రధాని దేవేగౌడతో వేదికను పంచుకోవడం అనేది ఓ ప్రత్యేకమైన అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం మంగళూరులో జరిగిన ఎన్నికల ప్రచార సంఘటనలను ప్రధానమంత్రి మోడీ ట్విట్టర్లో(x) వేదికగా పంచుకున్నారు. అలాగే మైసూర్ లోని మహారాజ కళాశాల మైదానంలో జరిగిన ఎన్డీఏ నేతృత్వం లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ గురు సర్కిల్ నుండి నవ ప్రాంతం వరకు జరిగిన రోడ్ షోలో వేలాదిమందిగా ప్రజలు వచ్చి ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. అయోధ్యలోని రాముడు యొక్క విగ్రహాన్ని తయారుచేసిన అరుణ్ యోగిరాజ్ ప్రధాని మోదీని కలిశారు. అలాగే ప్రధాని మోదీ గారు ఇంకో పోస్ట్ చేస్తూ కర్ణాటకలో భాజపా నేత జేడీ గారికి వస్తున్నా మద్దతును చూసి అత్యద్భుతం అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని ప్రస్తుతం ప్రజలందరూ ఇండియా కూటమి వైపే ఉన్నారని తేల్చి చెప్పారు. ప్రజలు కచ్చితంగా ఈసారి మళ్లీ గెలిపించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే చివర్లో మా రోడ్ షోలో పాల్గొన్న దేవేగౌడకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.