సినిమా ఆపడానికి వస్తారు గాని..పింఛన్ ఇవ్వడానికి ద్యోగులు లేరా?

National Political

తన సినిమా విడుదలయితే థియేటర్ల వద్దకు ఉద్యోగులను పంపిస్తారు కానీ..పింఛన్లు ఇంటి వద్ద ఇచ్చేందుకు ఎందుకు లేరని నిలదీశారు.కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి’ అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతేగాక, తన సినిమా బీమ్లా నాయక్ విడుదలైన సమయంలో థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులను రేట్లు పర్యవేక్షించేందుకు నియమించిన ఉత్తర్వులను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.ఇంటి వద్దకు వచ్చే పింఛన్లు టీడీపీ, జనసేన వల్లే ఆగిపోయాయని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పిన కూడా పట్టించుకోని దుర్మార్గ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *