Sunitha again fire on Avinash Reddy

Andhra Pradesh Political

ఇది పక్కా హత్య…. గుండెపోటు పేరున ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?.. : – వివేక కూతురు – ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఐదు సంవత్సరాల ముందు అంటే ఎలక్షన్స్ ముందు వైయస్సార్ కుటుంబంలోని వివేకానంద రెడ్డి హత్య అనేది హైలెట్గా నిలిచింది. అయితే ఆ విషయంపై అప్పట్లో ఎవరు చేశారు తెలియకపోయినా ఎలక్షన్స్ సందర్భంలో ఆ మరణ వార్త అనేది జగన్కు కలిసి వచ్చి సానుభూతితో సింపుల్గా సీఎం అయ్యాడు. అయితే ఆ విషయంపై వివేక కూతురు సునీత మాత్రం జగన్ పై మండిపడుతున్నారు. సొంత బాబాయి చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా హత్య చేసిన అంతకులను పట్టుకోకపోవడం ఒక సీఎంగా జగన్ విఫలమయ్యాడని అన్నారు. అంతేకాకుండా చంపిన వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఐదేళ్లు వెనకేసుకొచ్చారు అని ఫైరయ్యారు. అధికారంలో ఉండి కూడా సొంత కుటుంబానికి న్యాయం చేయలేం నువ్వు వాళ్ళ ప్రజలకి న్యాయం ఎలా చేస్తావు చెప్పాలి అని అన్నారు. అంతేకాక ఈ హత్యని హత్య కాదంటూ గుండెపోటు అంటూ సొల్లు కబుర్లు చెప్తున్నారని అంటూ సిబిఐ వాళ్ళ మీద కూడా మీ అధికారం పెత్తనం చాలా ఇస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడైనా ప్రజలు ఆలోచించాలి అని చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నీ యవ్వారం బయటపడుతుంది అని అన్నారు. ఏదో ఒక రోజు నేనే అంతకులను బయటపెడతానని వాళ్ళకి జీవితకాలం జైలు శిక్ష విధించేలా చేస్తానని గట్టిగా చెప్పారు. ఇది ఇంతటితో అయిపోదు ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసి చూపిస్తానని చెప్పారు.