దాడి తర్వాత జగన్ మొదటి యాత్ర… 15వ రోజు గుడివాడలో ప్రారంభించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర – వైయస్సార్సీపి అధినేత జనాల గుండెల్లో నిలిచిన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరిగి మళ్ళీ ప్రారంభించారు. రెండు రోజులుగా రాళ్లదాడి జరిగిన సందర్భంగా విశ్రాంతి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి మళ్ళీ బస్సుయాత్ర ప్రారంభించారు. గుడివాడలో ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కేసరిపల్లి నైట్ క్యాంప్ నుంచి జగన్ యాత్ర బయలుదేరుతుంది. గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి క్రాస్, హునుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడుకు చేరుకుని భోజన విరామానికి ఆగుతారు.అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జొన్నపాడు, జనార్ధనపురం మీదుగా సాయంత్రం గుడివాడకు చేరుకుంటారు. గుడివాడలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద రాత్రి బసకు జగన్ చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలో రాయిని గుర్తు తెలియని వ్యక్తులు విసరడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి నేటి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు.