ఈసీ కి హాట్సాఫ్…. (ఏపీఎస్ఈసీఎల్) మద్యం దోపిడీ ఇప్పుడైనా తగ్గుతుంది…! జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా మధ్యాన్ని అక్రమంగా తరలిస్తు ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ బేవరేజ్ స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి డి.వాసుదేవరెడ్డి పై వేటు పడింది. అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూల అధికారిగా వైసిపి ప్రభుత్వంలో మద్యానికి తావు లేకుండా ఎలా పడితే అలా వైసీపీకి లబ్ధి చేకూరేలా మద్యాన్ని సరఫరా చేస్తున్నడంతో ఎలక్షన్ సంఘానికి కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎలక్షన్స్ సంఘం ఆయన తొలగించింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించింది. ఎలక్షన్స్ సమయం అయిపోయే వరకు అతనికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు అని ఎలక్షన్ సంగం తేల్చింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక ప్యానల్ తయారుచేసి పంపించమని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాసుదేవ రెడ్డిని ఎక్సైజ్ శాఖ నుంచి ఉపసంహరిస్తూ.. సాధారణ పరిపాలన శాఖలో భాగం కావాలని సీఎస్ను కోరింది.