గుడివాడలో నానికి బిగ్ షాక్ … !

Andhra Pradesh

టిడిపికి గూటికి ముఖ్య నేత…. గుడివాడలో నానికి బిగ్ షాక్ … ! కృష్ణా జిల్లా : గుడివాడ : – కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నేత షేక్ మౌలాలి టిడిపిలో చేరడంతో గుడివాడలో హై టెన్షన్ మొదలైంది. షేక్ మౌలాలితోపాటు ఆయన అనుచరులు టిడిపిలో చేరడంతో గుడివాడ టిడిపి అభ్యర్థి వినిగండ్ల రాము వారిని సాదరంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గుడివాడ టిడిపి అభ్యర్థి వినిగండ్ల రాము మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి శూన్యం అందుకే వాళ్ల నాయకులే జగను నమ్మి పరిస్థితి లేక ఇవాళ టిడిపిలోకి చేరుతున్నారు. ఆ కొడాలి నాని పచ్చి మోసగాడు అని పార్టీ కోసం బ్రతికినా నాయకులని మోసం చేస్తాడని అవసరం ఉన్నప్పుడు వాడుకొని , తీరా అవసరం తీరాక వదిలేస్తాడని ఆ పార్టీ నేతలు బహిరంగ చెప్తున్నారని అన్నాడు. అలాగే గుడివాడలో కొడాలి నాని నమ్మే పరిస్థితి లేదని ప్రజలకి ఇప్పటికే అర్థమైంది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడి దిక్కులేదు కానీ అరాచకాలకు మాత్రం ముందే ప్రాతినిధ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. రోడ్లపై గుంతలు బాగు చేయలేని ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట వింతగా ప్రవర్తిస్తూ కొత్త నాటకాలను ఆడుతుంది. గుడివాడ అభివృద్ధి చెందాలి అంటే అలాగే భావితరాలకు ఆసరా ఉండాలంటే ప్రజలందరూ చంద్రబాబుకి మద్దతు తెలపాలని భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని టిడిపి అభ్యర్థి రాము గారు అన్నారు.