టిడిపి కార్యకర్తలపై వైసీపీ వరుస దాడులు

Andhra Pradesh Political

పల్నాడు జిల్లాలో ఘోరం…. టిడిపి కార్యకర్తలపై వైసీపీ వరుస దాడులు – మాచర్ల నియోజకవర్గం ; – పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మళ్లీ వరుస దాడులతో హైలైట్ గా నిలుస్తుంది. మళ్లీ చాలాకాలం తర్వాత ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సిద్ధం సభకు రాలేదని కోపం , మళ్లీ నిన్న రంజాన్ సందర్భంగా టిడిపి తరఫున ఇఫ్తార్ విందును ఇచ్చినందుకు దాడులు జరిగాయి. రెంటచింతల మండలం లో ఈనెల 5వ తారీఖున టిడిపి కార్యకర్త పఠాన్ జలీల్ ఖాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మాచర్ల నియోజకవర్గం టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ని ఆహ్వానించారు. అనంతరం టిడిపి తరఫున గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని చూసి ఓర్వలేక అక్కడ ఉన్న వైసిపి నాయకులు జలీల్ ఖాన్ పై కక్ష పెంచుకున్నారు. ఈ శుక్రవారం మసీద్ దగ్గరలోని అరుగుపై కూర్చొని మాట్లాడుతున్న జలీల్ ఖాన్ను ఐదు మంది వైసీపీ నాయకులు దాడి చేశారు. ఊర్లోకి టిడిపి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని పిలుస్తావా ? అలాగే ఇఫ్తార్ విందు కూడా ఇస్తావా? అని కోప్పడుతూ కర్రలతో విపరీతంగా కొట్టారు. ఈ సమయంలో జలీల్ ఖాన్ తో పాటు పక్కనే ఉన్న తన స్నేహితుడు చాంద్బాషాలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో పక్కన ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. గాయాలైన జలీల్ ఖాన్ అలాగే చాంద్బాషాలని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. అలాగే మసీద్ వీధిలోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు మాచర్లలో దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.