ఒక పోస్ట్ డిలీట్ చేసి మరో పోస్ట్ నాగబాబు

Andhra Pradesh Political

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే నాగబాబు తరచూ ఏదోఒక వివాదంలో ఉంటారు.గతంలో కోడుకు సినిమా విషయంలో మాట్లాడుతూ.. పొట్టిగా ఉండే వాళ్ళు పోలీస్ పాత్రకి సెట్ అవ్వరు అని ఎన్టీఆర్ ఫాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడారు.ఇక ఫాన్స్ దెబ్బకి క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నాగబాబు ఓ ట్వీట్ చేశారు.చాల పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.. అసలు స్క్రిప్ట్‌లా అనిపించడంలేదు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏమైందో తెలీదుగానీ ఆ ట్వీట్‌ని తొలిగించి.. నాగబాబు మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య అని పేర్కొన్నారు. అలానే జనసేన ప్రధాన కార్యదర్శిగా తాను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.కాగా నాగబాబు మొదట చేసిన ట్వీట్ డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక రెండవసారి నాగబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ తెలివి ముందు ఏమైంది, అడ్డంగా మనిషి పెరిగితే సరిపోదు అని, ట్వీట్ ఎందుకు డిలీట్ చేసావ్ రా స్నేక్‌గా, మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ రాజకీయ భవిష్యత్తు ఇలా ఏడ్చింది, యాక్ తూ అని కామెంట్లు చేస్తున్నారు.