బిగ్ కౌంటర్ ఇచ్చిన షర్మిల..!

Andhra Pradesh Political

షర్మిల మరియు సునీతలపై చేసిన వ్యాఖ్యలకు బిగ్ కౌంటర్ ఇచ్చిన షర్మిల..! : – ఆంధ్ర రాజకీయాల్లో మరో కొత్త వ్యాఖ్యలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా షర్మినా మరియు సునీత ఇద్దరూ కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరువు తీస్తున్నారు అంటూ షర్మిల యొక్క మేనత్త విమలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గాను షర్మిల తన మేనత్త వేములమ్మకు భారీ కౌంటర్ ఇచ్చారు. చనిపోయింది తన సొంత అన్నగారు అని విమలమ్మ మర్చిపోయినట్లున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి అని తీవ్రంగా మండిపడ్డారు. ఆమె కుమారుడికి జగన్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి ఆర్థికంగా బాగా బలపరిచినందుకు అన్ని మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. తన అన్న వివేక గారు ఆమెకు ఎంత హెల్ప్ చేశారు ఒకసారి ఆలోచించుకోవాలని తన మేనత్త విములమ్మకు కు చెప్పారు. అధికారంలో ఉండి ఇంకా వివేక గారు హత్య కేసులో అంతకులను ఇంకా కనిపెట్టలేదంటే జగన్ పాత్ర ఎంతుందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని తన మేనత్త వేములమ్మకు అలాగే ప్రజలకు విన్నపించారు. జగన్ గారు అధికారాన్ని ప్రజలకు కాకుండా తన ఆర్థిక బలోపేతాలకు వినియోగించుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి నాయకుడు మనకి అవసరమా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన కావాలా మీరే తేల్చుకొని నాకు ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరారు షర్మిల. ఇలా వీరిద్దరి మధ్య వ్యాఖ్యలు రాష్ట్రంలోనూ హార్ట్ టాపిక్ గా మారిపోయాయి.