Gelupu Manade…

Andhra Pradesh

 మనం గెలుస్తున్నాం…. పార్టీ గెలుస్తుంది… అభివృద్ధి జరిగి తీరుతుంది… ; – ఉగ్ర, మాగుంట – కనిగిరిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒంగోలు పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి కనిగిరి మండలం నందన మారెళ్ల వద్ద కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కనిగిరి మండలం నందన మారెళ్ల, గానుగపెంట, బడుగులేరు, ఎడవల్లి, దిరిశవంచ, ఎర్ర ఓబనపల్లి తదితర గ్రామాలకు చెందిన 200కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. వారికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. కనిగిరి అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి అయిన తనను గెలిపించడం అభివృద్ధికి మలుపు అని తెలిపారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని, తద్వారా సంక్షేమ పాలన సాధ్యమవుతుందని తెలిపారు.అనంతరం కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో జరిగిన ఆరు మండలాల టిడిపి నాయకులతో జరిగిన సమావేశంలోనూ, అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి, టిడిపి నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిచ్చల శ్రీనివాసరెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, పల్లా మాలకొండయ్య, చింతలపూడి తిరుపాలు, చెరుకూరి నరసింహారావు, చింతలపూడి వాసుదేవరావు, కొబ్బరి బోండాలు సుబ్బారావు, ఈదర రవికుమార్‌, షేక్‌ బారా ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.