డ్రామాలు చేస్తూ ఓట్లు పొందలేరు

Andhra Pradesh

ప్రతిసారి డ్రామాలు చేస్తూ… సానుభూతి ఓట్లు పొందలేరు : – జీవి ఆంజనేయులువినుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు తమ యొక్క టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మరో కొత్త నాటకం మొదలుపెట్టారని జగన్ మీద ఫైర్ అయ్యారు. ఈ మధ్యనే సిట్ కార్యాలయంలో ఆధారాలను ధ్వంసం చేసిన ఘటన నుంచి ప్రజలు దృష్టి మల్లాలని భావనతో జగన్ ఈ యొక్క గులకరాయ నాటకం ఆడుతున్నారని వినకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆధారాల ధ్వంసం వ్యవహారంలో సిఐడి మరియు సిట్ అధికారులు అడ్డంగా దొరికి పోయేసరికి ఇలాంటి దొంగ నాటకాలు ఆడుతున్నారు అని అన్నారు. వీటితోపాటు ట్యాపింగ్ ఉచ్చు వీరి యొక్క మెడకి చుట్టుకోబోతుంది అని అన్నారు. ఈ విషయంలో ఆ యొక్క అధికారులను అలాగే తనను తాను కాపాడుకోవడానికి జగన్ ఈ యొక్క గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా మీకు మీరు నాటకాలు ఆడుకుంటా మధ్యలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి టిడిపి వాళ్ళు చేశారు జనసేన నాయకులు చేశారు అని ఎదవ సొల్లు కబుర్లు చెబుతున్నారు అని అన్నారు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారని ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు అని ఈ సెంటిమెంట్ సానుభూతులకు ప్రజలు తలవంచి ఓట్లు వేయరని జగన్ మీద ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరని అన్నారు. సీఎంను గద్దె దించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని అలాగే చంద్రబాబుని భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు