సోషల్ మీడియా ని దున్నుతున్న దువ్వాడ రచ్చ

అవీ ఇవీ

సినిమాలకు మించిపోయిన ఏపీ రాజకీయవేత్త దువ్వాడ శ్రీనివాస్,మాధురి డాన్స్ వ్యవహారం… సోషల్ మీడియాలో ట్రెండింగ్ నెంబర్ వన…..కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి మధ్య ఏదో ఉంది అని దువ్వాడ శ్రీనివాస్ భార్య మరియు పిల్లలు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే మేమిద్దరం ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కలుస్తాం, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాం అటు ఇటు తేలని సమాధానం ఇస్తున్నారు శ్రీనివాస్ మరియు మాధురి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా అయినటువంటి వాట్సాప్, ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి వాటిల్లో ఎక్కడ చూసినా సరే ఇదే గోల. అయితే దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొంది పోలింగ్ అనంతరం దేవాలయాలకు, టూర్ల సందర్శనకు ఎన్నో చోట్లకి వెళ్లారు.

ఆస్ట్రాలజీ సేవల కోసం చూస్తున్నారా?

అయితే ఈ కథ అనేది అక్కడే మొదలైంది. అప్పట్లోనే మాధురిని వెంట వేసుకొని ఆ దేవాలయాల సందర్శనకు టూర్లకు ఇద్దరు తిరిగారు. ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటూ అప్పట్లోనే వైరల్ అయ్యారు. కానీ అప్పట్లో ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇపుడు అవే ఫొటోస్, వీడియో బయటకి వచ్చాయి వాళ్ళ కొంప ముంచాయి. ఒకపక్క మమ్మల్ని వీధినా పడేసారని మాధురి..ఒకపక్క నన్ను ఇంట్లో మా ఆవిడా పిల్లలు పట్టించుకోవట్లేదాని శ్రీనివాస్ అందుకే నేను మాధురి స్నేహం చేస్తున్నాం, ఇద్దరం ఒకటయ్యం, కలిసి తిరిగాం అని శ్రీనివాస్ అంటున్నాడు. ఈ క్రమము లోనే అప్పటిలో తీసిన వీడియో లు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఆ వీడియోస్ ఏకంగా రాధేశ్యాం, బాహుబలి ల వేరే లెవెల్ గ్రాఫిక్స్ ఉన్నట్టు ఉన్నాయ్. దీనితో ఓన్లీ ఫ్రండ్స్ అయితే మరి ఇంతలా కలిసి గ్రాఫిక్స్ ఏంట్రా బాబు అన్నట్టు సోషల్ మీడియా లో ట్రేండింగ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోస్ కనుక నిజంగా రుజువైతే వీళ్ళ వివాద్ధం అనేది మరో స్థాయికి చేరడం కచ్చితంగా అవుతుందని అటు రాజకీయానేతలు ఇటు ప్రజలు ఒకపక్క ఇరుకుటుంబాల శ్రేయోభిలాషులు అంటున్నారు.