చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సిపి… రాజ్యసభలో వైసీపీ దే హవా – ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి పార్టీ నేరుగా రాజ్యసభలోనే నాలుగవ అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే దేశంలో అతి పెద్ద మెజార్టీ పార్టీ కలిగిన బిజెపి 97 సీట్లతో మొదటి స్థానంలో ఉంది. తరువాత రెండవ స్థానంలో కాంగ్రెస్ 29 రాజ్యసభ సీట్లను కలిగి ఉంది. ఇక మూడవ స్థానంలో టీఎంసీ 13 రాజ్యసభ సీట్లను కలిగి ఉంది. దీని తర్వాత స్థానంలో ఏపీలోని వైఎస్ఆర్సిపి పార్టీ 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లు గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రత్యక్ష పార్టీ అయినా టిడిపికి ఉన్న రాజ్యసభ ఏకైక ఒక ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇవాల్టితో పదవి కాలం ముగియడంతో టిడిపి జీరోకి పరిమితమైంది. ఇవాల్టి నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ ప్రాతినిథ్యం ఉండబోతుంది.