గుంటూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర

Andhra Pradesh Political

జగన్ పర్యటన 14వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగనుంది.
ఉదయం నంబూరు బైపాస్ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో కొంచెంసేపు ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజనానికి విరామం తీసుకోనున్నారు జగన్. తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస చేయనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి గుంటూరు జిల్లా ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు..